
AMPM Live : బీచ్ రోడ్డులోని వైఎంసిఎ ఎదురుగా రూ.3.54 కోట్ల నిధులతో అధునాతన పార్క్ రూపుదిద్దుకుంది. తీరానికి ఆనుకుని ఉండే ఈ పార్కులో ఆటవస్తువులను చూస్తే ఔరా అనిపించకమానదు. ‘పార్క్ ఫర్ చిల్డ్రన్స్ విత్ ఆల్ ఎబిలిటీస్’ అనే పేరుతో స్మార్ట్ పార్క్ గా దీనిని తీర్చిదిద్దారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఇక్కడ విశేష ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పార్కులో సాధారణ పిల్లల కోసం, దివ్యాంగ బాలల కోసం రెండు బ్లాక్ లలో ఆటవస్తువులను ఏర్పాటు చేసారు. ఒకేసారి ఎక్కువ మంది పిల్లలు ఆడుకునేందుకు వీలుగా రెండు బ్లాక్ లలో మల్టీ ప్లే ఎక్విప్ మెంట్ సిస్టంను అమర్చారు. దీంతో పాటూ సాధారణ పిల్లల కోసం టన్నెల్స్, మిడీ స్పేస్ నెట్, స్పైర్ నెట్, క్లైoబింగ్ నెట్ వంటి సాహస క్రీడలతో పాటూ పిల్లలు ప్రమాదవశాత్తు కింద పడినా వారికి ఏమీ కాకుండా ఈపీడీ మెటీరియల్ తో చేసిన గ్రాన్యుయల్ ఫ్లోరింగ్ ను ఆటవస్తువులు ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసారు. దివ్యాంగ బాలల కోసం డ్రమ్స్, సబాకస్, స్వింగర్స్ తదితర ఆటవస్తువులను అందుబాటులో ఉంచారు. ఈ పార్కులో ఓవర్ బ్రిడ్జి, షిప్ డెక్ ప్రత్యేక ఆకర్షణ. షిప్ డెక్ లోకి ప్రవేశించి మెట్ల ద్వారా ఓవర్ బ్రిడ్జి పైకి చేరుకోవచ్చు. దీనిపై నుంచి బీచ్ అందాలు చూడడం ప్రత్యేకంగా అనిపిస్తుంది. అలాగే పార్కులో అందమైన ల్యాండ్ స్కేపింగ్, రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేసారు. ఇలా పార్క్ లో అడుగడుగునా ఎన్నో ఆకర్షణీయతలు కనిపిస్తాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ పార్కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అనంతరం దీనిని నగరవాసులకు వినియోగంలోకి తీసుకురానున్నారు.
Park For Children With All Abilities || R.K.Beach || Special Story - YouTube |
| 9 Likes | 9 Dislikes |
| 175 views views | 35,300 followers |
| Entertainment | Upload TimePublished on 22 Aug 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét